Gold Rates: దిగొచ్చిన బంగారం ధరలు.. నేడు తులం ఎంత తగ్గిందంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.56,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,100గా నమోదైంది.
- By Gopichand Published Date - 06:53 AM, Wed - 24 May 23
Gold Rates: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.56,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,100గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.78,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (మే 24, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Spicejet Offer: రూ.1818కే విమాన టికెట్.. రూ.3 వేల కూపన్.. ప్రయాణికులకు స్పైస్జెట్ స్పెషల్ ఆఫర్!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,250గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,580గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,100 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,500 ఉండగా, ముంబైలో రూ.74,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000 ఉండగా, కోల్కతాలో రూ.74,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.78,000 ఉండగా, కేరళలో రూ.78,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.78,000 ఉండగా, విజయవాడలో రూ.78,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Swiggy: స్విగ్గీకి షాక్ ఇచ్చిన ఐస్ క్రీమ్.. అసలేం జరిగిందంటే..?
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.