Gold Price Today: దేశ వ్యాప్తంగా నేటి ధరలివే.. బంగారం రేట్స్ ఇలా.. వెండి రేట్స్ అలా..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్వల్పంగా తగ్గాయి. సోమవారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,790గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,860గా నమోదైంది.
- Author : Gopichand
Date : 10-04-2023 - 7:34 IST
Published By : Hashtagu Telugu Desk
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్వల్పంగా తగ్గాయి. సోమవారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,790గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,860గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 80,200 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక సోమవారం (ఏప్రిల్ 10, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,940 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,010గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,390 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,520గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,790 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,860 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,860గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,910గా ఉంది.
Also Read: Alekhya Reddy: మరోసారి అలేఖ్య రెడ్డి షాకింగ్ పోస్ట్… ఎమోషన్ అయిపోయిన ఫ్యాన్!
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,600 ఉండగా, ముంబైలో రూ.76,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200 ఉండగా, కోల్కతాలో రూ.76,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,200 ఉండగా, కేరళలో రూ.80,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80,200 ఉండగా, విజయవాడలో రూ.80,200 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.