Drugs Case : డ్రగ్స్ కేసులో తెలంగాణ వ్యక్తిని అదపులోకి తీసుకున్న గోవా పోలీసులు
డ్రగ్స్ కేసును విచారించేందుకు గోవా పోలీసులు తెలంగాణకు వచ్చారు. తెలంగాణకు వచ్చిన గోవా పోలీసు క్రైమ్ బ్రాంచ్...
- By Prasad Published Date - 09:02 AM, Fri - 21 October 22
డ్రగ్స్ కేసును విచారించేందుకు గోవా పోలీసులు తెలంగాణకు వచ్చారు. తెలంగాణకు వచ్చిన గోవా పోలీసు క్రైమ్ బ్రాంచ్ బృందం సిద్దిపేట జిల్లాకు చెందిన మహేష్ గౌడ్ అనే వ్యక్తిని గురువారం కస్టడీలోకి తీసుకుంది. గత వారం గోవా-హైదరాబాద్ లింక్ కేసులో సికింద్రాబాద్కు చెందిన వ్యక్తితో సహా ఈ కేసులో పోలీసులు గతంలో కొంతమందిని అరెస్టు చేశారు. యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తి సియోలిమ్ తీరప్రాంత గ్రామంలో వినియోగదారులకు MDMA విక్రయిస్తుండగా పట్టుబడ్డాడు. హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు తనకు డ్రగ్ను సరఫరా చేసినట్లు అంగీకరించాడు. స్థానిక పోలీసుల సహాయంతో మహేశ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం గోవాకు తరలించినట్లు సమాచారం. కొన్ని సిండికేట్లు నడుపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై విచారణ చేసేందుకు గోవా క్రైం బ్రాంచ్ బృందం మూడు రోజుల క్రితం తెలంగాణకు వచ్చింది.
Tags
Related News
Telangana: నేత కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. నేతన్నలకు 50 కోట్లు విడుదల
నేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు.రంజాన-సిరిసిల్ల జిల్లాలోని పవర్ లూమ్ నేత కార్మికుల పెండింగ్ బిల్లుల కోసం రూ.50 కోట్లు విడుదల చేశారు.