Gayathri Jayanthi :ఆర్థిక కష్టాలు తీరాలంటే జూన్ 10న గాయత్రి జయంతి రోజున ఈ పని చేయండి..!!
- By hashtagu Published Date - 06:00 AM, Sun - 5 June 22
హిందూ పురాణాల ప్రకారం, గాయత్రి మాత జ్యేష్ఠమాసంలో శుక్లపక్షం ఏకాదశి రోజున జన్మించింది. గాయత్రీ జయంతిని పవిత్ర పండుగను ప్రతిఏడాది జ్యేష్ట మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి అన్నిఏకాదశులలో కెళ్లా ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. గాయంత్రీ జయంతి రోజున…గాయత్రిమాతను పూజిస్తే…అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు.అయితే గాయత్రి జయంతి ఎప్పుడు వస్తుంది…పూజావిధానం, ప్రాముఖ్యత, శుభసమయం గురించి తెలుసుకుందాం.
గాయత్రి జయంతి తేదీ
ఈ సంవత్సరం గాయత్రి జయంతిని జూన్ 11, 2021 శనివారం జరుపుకుంటారు.
గాయత్రీ జయంతి ముహూర్తం
ఏకాదశి తిథి ప్రారంభం – జూన్ 10, 2022 ఉదయం 07:25 గంటలకు
ఏకాదశి తేదీ ముగుస్తుంది – జూన్ 11, 2022 ఉదయం 05:45 గంటలకు
గాయత్రీ జయంతి పూజ – విధానం
ఈ రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. తర్వాత ఇంట్లో దీపం వెలిగించాలి. గంగాజలంతో సకల దేవతలకు అభిషేకం నిర్వహించాలి. ఇప్పుడు మాత గాయత్రిని ధ్యానిస్తూ…గాయత్రీ మంత్రాన్ని జపించండి. అమ్మవారికి పూలు సమర్పిస్తూ… ఆ తల్లిని ఆరాధించండి. భగవంతునికి సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించబడుతాయని గుర్తుపెట్టుకోండి.
గాయత్రీ మంత్రం
‘ఓం భూర్భువ: స్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ధ్యో యో న: ప్రచోదయాత్..
Related News
AP Inter Result 2024: ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు రేపే విడుదల
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు ఇంటర్ బోర్డు రేపు ప్రకటించనుంది. ప్రథమ, ద్వితీయ పరీక్షలకు హాజరైన విద్యార్థులు శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఫలితాలను చూసుకోవచ్చు