Sharad Yadav Passes Away: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ (Sharad Yadav)(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ ధ్రువీకరించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
- By Gopichand Published Date - 11:40 PM, Thu - 12 January 23
కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ (Sharad Yadav)(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ ధ్రువీకరించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని వాజ్పేయ్ ప్రభుత్వంలో శరద్ యాదవ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1999 – 2004 మధ్య కాలంలో అప్పటి ప్రధాని వాజ్పేయి ప్రభుత్వంలో వివిధ శాఖలను నిర్వహించారు. ఆయన బీహార్లోని జనతాదళ్ యునైటెడ్ JD(U) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. జేడీయూ నుంచి 2018లో విడిపోయి, తన సొంత పార్టీ లోక్తాంతరిక్ జనతా దళ్ (LJD) పార్టీ స్థాపించారు.
విద్యార్థి రాజకీయాల నుంచి పార్లమెంటు వరకు ప్రయాణించిన శరద్ యాదవ్.. మధ్యప్రదేశ్ మూలానికి చెందినప్పటికీ బీహార్, ఉత్తరప్రదేశ్ రాజకీయాల నుండి తన రాజకీయ జీవితానికి అక్షాంశంగా మారారు. శరద్ యాదవ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత బీహార్లో తన రాజకీయ ప్రాబల్యాన్ని చూపించాడు. జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. శరద్ యాదవ్ జూలై 1, 1947న మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లోని బందాయ్ గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. శరద్ చిన్నప్పటి నుంచి చదువులో చాలా తెలివైనవాడు. తన ప్రాథమిక విద్య తర్వాత అతను ఇంజనీర్ కావాలని కలలు కన్నాడు. ఇందుకోసం మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని ఇంజినీరింగ్ కాలేజీలో చేరి బీఈ పట్టా తీసుకున్నాడు.
బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పిన శరద్యాదవ్ 1947 జూలై 1న మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్లోని అఖ్మౌ గ్రామంలో జన్మించారు. 1974లో జబల్పూర్ నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 2003లో ఏర్పాటైన జనతాదల్ యునైటెడ్(జేడీయూ)కు తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. జేడీయూ తరపున ఆయన ఏడుసార్లు లోక్సభకు, మూడుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. మాజీ ప్రధాని వాజ్పేయ్ ప్రభుత్వంలో శరద్యాదవ్ కేంద్రమంత్రిగా పనిచేశారు. 2018లో లోక్తాంత్రిక్ జనతాదళ్ పేరుతో కొత్తపార్టీని స్థాపించారు.
Pained by the passing away of Shri Sharad Yadav Ji. In his long years in public life, he distinguished himself as MP and Minister. He was greatly inspired by Dr. Lohia’s ideals. I will always cherish our interactions. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) January 12, 2023
కేంద్ర మాజీ మంత్రి శరద్యాదవ్ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. “సీనియర్ నేత శరద్యాదవ్ ఆకస్మిక మరణం నన్నెంతగానో బాధిస్తోంది. శరద్యాదవ్ ఎంపీగా, కేంద్రమంత్రిగా తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ లోహియాను ఆదర్శంగా తీసుకుని గొప్పగా ప్రేరణ పొందారు. మేం ఒకరినొకరం పరస్పరం గౌరవించుకుంటాం. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని మోదీ ట్వీట్ చేశారు.