Konda Vishweshwar Reddy: కొండంత “నీడ”
భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్ర ఎండలతో పడరాని పాట్లు పడుతున్నారు.
- By Balu J Published Date - 12:43 PM, Tue - 24 May 22
భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్ర ఎండలతో పడరాని పాట్లు పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఈ పరిస్థితుల్లో చిరు వ్యాపారులు, కార్మికులు, రైతులు ఎండలను సైతం లెక్కచేయకుండా తమ తమ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఎండలకు భయపడి పనికెళ్లకపోతే పస్తులుండాల్సిన పరిస్థితి వాళ్లది. అలాంటివాళ్ల జీవితాలకు గొడుగు పట్టే ప్రయత్నం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
ఎండలకు చెక్ పెట్టేలా “నీడ” పేరుతో గొడుగులను ఆవిష్కరించారాయన. దీన్ని తలకు తొడుక్కొని హాయిగా పనిచేసుకోవచ్చు. రోడ్లు ఊడ్చే మున్సిపల్ మహిళా కార్మికులకు, ట్రాక్టర్ డ్రైవర్ లకు, ఎడ్ల బండి నడిపే రైతులకు, గోర్ల కాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎండ నుంచి కాదు.. వర్షం చినుకుల నుంచి జనాలను రక్షణ కవచంగా ఉంటుంది. ప్రస్తుతం కొండా విశ్వేశ్వర్ రెడ్డి అందించిన గొడుగులు చేవేళ్లలోని పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మండుటెండల్లోనూ తమ తమ పనులు చేసుకుంటున్నారు.
In summer working under the Sun is extremely harsh for women working under in the fields, street vendors, shepards etc.
"Needa" our simple innovation is a Great hit in Chevella Parliament. pic.twitter.com/Z9Cus9pq5a
— Konda Vishweshwar Reddy (@KVishReddy) May 24, 2022
Related News
Chilkur: హనుమాన్ ఆలయానికి భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం వ్యక్తి
Chilkur: ప్రసిద్ధ చిల్కూరు బాలాజీ ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామం త్వరలో వార్తల్లోకి రానుంది. కొత్తగా నిర్మించిన హనుమాన్ ఆలయానికి ఒక ముస్లిం గ్రామస్థుడు 5 గుంటల భూమిని విరాళంగా ఇచ్చాడు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను పర్యవేక్షించడం కోసం ముఖ్య అతిథిగా చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఆహ్వానించారు. హనుమాన్ దేవాలయం కోసం తన స్థల�