Accident : మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం…5గురు దుర్మరణం..!!
మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.
- By hashtagu Published Date - 04:58 AM, Tue - 18 October 22
మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలతోపాటు ఓ చిన్నారి, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆటోరిక్షాను ఢీ కొట్టటడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. జాఫ్రాబాద్ మహోరా రాహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జిన్నింగ్ ఫ్యాక్టరీ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆటోను ఢీ కొట్టింది. ఆటోలో ఉన్న ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్కు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Tags
Related News
Bus Falls Off Flyover : ఫ్లైఓవర్ నుంచి పడిపోయిన బస్సు.. ఐదుగురి మృతి, 40 మందికి గాయాలు
Bus Falls Off Flyover : ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు.