Dowleswaram : దౌలేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
దౌలేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తుంది. గత వారం రోజులగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ
- By Prasad Published Date - 07:50 AM, Thu - 27 July 23
దౌలేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తుంది. గత వారం రోజులగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతంది. దీంతో ఈ రోజు (గురువారం) ఉదయం 6 గంటలకు గోదావరి నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ సమయంలో 10,02,425 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. డెల్టా సాగునీటి కాలువలకు 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉదయం 6 గంటలకు భద్రాచలంలో వరద మట్టం 50.30 అడుగులకు చేరింది. రెండవ హెచ్చరిక అమలులో ఉంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఈ వరద ప్రవాహం దౌలేశ్వరం బ్యారేజీకి చేరుతుంది. ఈరోజు రాత్రి వరకు బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.