Jangaon: నడుస్తున్న ప్యాసింజర్ వాహనంలో మంటలు
జాతీయ రహదారిపై వెళ్తున్న టాటా ఏస్ వాహనంలో మంటలు చెలరేగాయి . ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగలు అలుముకున్నాయి.
- By Praveen Aluthuru Published Date - 04:08 PM, Tue - 12 December 23
Jangaon: జాతీయ రహదారిపై వెళ్తున్న టాటా ఏస్ వాహనంలో మంటలు చెలరేగాయి . ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగలు అలుముకున్నాయి. ఈ ఘటన జనగాం జిల్లా చిల్పూర్ మండలం వంగపల్లి సమీపంలో వరంగల్-హైదరాబాద్ హైవే వద్ద చోటుచేసుకుంది .
ఇంజన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. ఆ తర్వాత ప్రయాణికులు వెంటనే కిందకు దిగారు. దీంతో ప్రయాణికులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు వాహనం దిగిన కొద్దిసేపటికే టాటా ఏసీ నుంచి భారీ మంటలు చెలరేగాయి. వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Minister Seethakka: మేడారం జాతరలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం: మంత్రి సీతక్క
Related News
Harish Rao: చంద్రబాబుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
హరీష్ సంచలన కామెంట్స్ కు పాల్పడ్డారు. విభజనలో భాగంగా పదేళ్ల గడువు ముగిసినా హైదరాబాద్ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని హరీష్ చెప్పారు.