Farmer’s Letter: ఆత్మహత్య చేసుకుంటా.. అనుమతి ఇవ్వండి : కేటీఆర్ కు యువరైతు లేఖ!
ఆత్మహత్య చేసుకుంటా అనుమతి ఇవ్వండి అంటూ 25 ఏళ్ల యువ రైతు మంత్రి కేటీఆర్ కు లేఖ రాశాడు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న బి.
- By Hashtag U Published Date - 10:22 AM, Sun - 23 January 22
ఆత్మహత్య చేసుకుంటా అనుమతి ఇవ్వండి అంటూ 25 ఏళ్ల యువ రైతు మంత్రి కేటీఆర్ కు లేఖ రాశాడు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న బి. టెక్ పట్టభద్రుడైన శ్రీను తన పొలాల్లోంచి అధికారులే గెంటేశారని, ఆ భూమి ప్రభుత్వానిదేనని చెప్పారన్నారు. 2010లో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పనులు ప్రారంభించి భూములు సేకరిస్తున్న నేపథ్యంలో జి.యడవెల్లి గ్రామంలోని తన పూర్వీకుల భూమిని అమ్మి ఆ కుటుంబం సర్వే నంబర్ 354లోని భూములను కొనుగోలు చేసింది.
అయితే అధికారులు మాత్రం ఆ భూమిని ఇప్పటికే సేకరించినట్లు చెబుతున్నారని బాధితుడు చెబుతున్నారు. భూసేకరణ పూర్తయితే, రెవెన్యూ శాఖ నాకు ఎందుకు పట్టా ఇచ్చింది..? 2016లో సమగ్ర భూ సర్వే తర్వాత డిజిటల్ పాస్బుక్ ఎందుకు జారీ చేసింది? అని లేఖలో పేర్కొన్నాడు. అధికారులు తమను ఖాళీ చేయించారని.. ఆ భూమిని పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు వినియోగిస్తున్నారని శ్రీను తల్లి చెబుతోంది. అయితే మంత్రి కేటీఆర్, కలెక్టర్, జిల్లా అధికారులు, అధికార పక్షం, ప్రతిపక్ష నేతలు కూడా ఈ విషయంపై స్పందించలేదని కనగల్కు చెందిన చొప్పరి శ్రీను జనవరి 19న ఆత్మహత్యకు అనమతి ఇవ్వండి అంటూ రెండు పేజీల లేఖను మంత్రి కేటీఆర్, నల్గొండ జిల్లా కలెక్టర్ లకు రాశారు.
పర్మిషన్ ఇస్తే హత్య.
ఇవ్వకపోతే ఆత్మహత్యే దిక్కు.
దొరగారి పాలనలో చావు మాత్రం పక్కా .
ఉద్యోగాల కోసం చావాలి.
ఉద్యోగాలను కాపాడుకోవడం కోసం చావాలి.
పంటను అమ్ముకోవడం కోసం చావాలి.
భూములు గుంజుకొంటే
నష్టపరిహారం కోసం సజీవదహనం చేసుకోవాలి.
ఎలాగైనా చచ్చుడే. అంతే కదా చిన్న దొర @KTRTRS pic.twitter.com/909uy6sh3j— YS Sharmila (@realyssharmila) January 22, 2022
Related News
BRS Minister: తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడంలో కేటీఆర్ ది కీలక పాత్ర
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు