Bharat Ratna For PV: పీవీకి భారతరత్న.. అందుకున్న కుటుంబ సభ్యులు, వీడియో..!
రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పీవీ నరసింహారావు (Bharat Ratna For PV) తరపున ఆయన కుమారుడు ప్రభాకరరావు… రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.
- By Gopichand Published Date - 11:47 AM, Sat - 30 March 24
Bharat Ratna For PV: రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పీవీ నరసింహారావు (Bharat Ratna For PV) తరపున ఆయన కుమారుడు ప్రభాకరరావు… రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. కర్ఫూరీ ఠాకూర్, చౌధురి చరణ్ సింగ్ , MS స్వామినాధన్ కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాలు అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ ఆదివారం అద్వానీ ఇంటికి వెళ్లి భారత రత్న ప్రదానం చేయనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం (మార్చి 30) దేశంలోని 5 మంది వ్యక్తులను అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించారు. వీరిలో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, పి.వి. నరసింహారావు, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఉన్నారు. సీనియర్ బిజెపి నాయకుడు లాల్ కృష్ణ అద్వానీని కూడా భారతరత్నతో సత్కరించవలసి ఉంది. కానీ ఈ రోజు ఆయన రాష్ట్రపతి భవన్కు హాజరు కాలేదు. మార్చి 31న రాష్ట్రపతి ఆయన ఇంటికి వెళ్లి సన్మానించనున్నారు. అద్వానీ మినహా మిగిలిన నలుగురికి మరణానంతరం భారతరత్న ఇస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను రాష్ట్రపతిని సన్మానించారు.
Also Read; Election King : 238 సార్లు ఎన్నికల్లో ఓడినా.. మళ్లీ పోటీ చేస్తున్న పద్మరాజన్!
*NewsFlash* | President Droupadi Murmu presents Bharat Ratna Award on former PM PV Narasimha Rao (Posthumously) at the Rashtrapati Bhavan pic.twitter.com/5oGIvueL1P
— Videozadda (@NewS79906) March 30, 2024
ఈ వ్యక్తులు భారతరత్న అందుకున్నారు
మాజీ ప్రధాని నరసింహారావు భారతరత్న అవార్డును ఆయన కుమారుడు – పివి ప్రభాకర్ రావు అందుకున్నారు. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ భారతరత్న అవార్డును ఆయన కుమార్తె డాక్టర్ నిత్యారావు అందుకున్నారు. కర్పూరీ ఠాకూర్ భారతరత్న అవార్డును ఆయన కుమారుడు రామ్నాథ్ ఠాకూర్ అందుకున్నారు. చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న అవార్డును అతని మనవడు జయంత్ చౌదరికి రాష్ట్రపతి చేతుల మీదుగా అందించారు.
We’re now on WhatsApp : Click to Join
Watch | President Droupadi Murmu presents the #BharatRatna award to former PM PV Narasimha Rao (posthumously)
The award was received by his son PV Prabhakar Rao#IndianNavy #India #Trending #Popular pic.twitter.com/OCD93mf4N7
— Akhilesh Tiwari ⚖️👨⚖️ (@ImAkhilesh007) March 30, 2024
ఈ ఏడాది ఐదుగురు వ్యక్తులకు భారతరత్న అవార్డును అందజేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2014లో అధికారం చేపట్టిన తర్వాత మోదీ హయాంలో మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహారీ వాజ్పేయి, ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్లు ఈ గౌరవాన్ని అందుకున్నారు. 2024కి చెందిన 5 మంది సెలబ్రిటీలతో కలిపి ఇప్పటివరకు ఈ గౌరవాన్ని అందుకున్న వారి సంఖ్య 53కి చేరింది.
Tags
Related News
Seethakka: రాష్ట్రపతి నిలబడితే.. మోడీ కూర్చుంటారా?.. ప్రధాని తీరుపై సీతక్క విమర్శ
Danasari Seethakka: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ(LK Advani)కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna)ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆదివారం స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేసిన విషయం తెలిసిందే. వయోభారం, అనారోగ్య కారణాలతో అద్వానీ శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్రపతే స్వయ�