Sankranti Special: సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక రైళ్ల పొడిగింపు!
- By Balu J Published Date - 12:40 PM, Sat - 25 December 21
సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో నగరం జనం సొంతూళ్ల బాట పట్టనున్నారు. ఇప్పటికే రైళ్లు, ఆర్టీసీ బస్సుల సీట్ల రిజర్వేషన్ దాదాపుగా పూర్తి చేసుకున్నారు. ప్రతి పండుగకు రవాణా సౌకర్యాలు అంతంతమాత్రమే ఉండటంతో రైల్వే శాఖ మరిన్ని రైళ్లు నడపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో జనవరిలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
వివరాలు ఇవే
07067-07068 మచిలీపట్నం-కర్నూలు (జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు),
07455 నర్సాపూర్- సికింద్రాబాద్ (2వ తేదీ, 9వ తేదీ, 16వ తేదీ, 23వ తేదీ, 30వ తేదీ)
07456 సికింద్రాబాద్-విజయవాడ (3,10,17, 24, 31)
07577 మచిలీపట్నం-సికింద్రాబాద్ వయా ఖాజీపేట (2, 9, 16, 23, 30)
07578 సికింద్రాబాద్-మచిలీపట్నం వయా గుంటూరు (2, 9, 16, 23, 30)
07605 తిరుపతి-అకోలా (7, 14, 21, 28)
Related News
AP Politics : ఏపీ ఓటర్ల తీర్పు ఆదర్శం కానుందా..? లేక..
మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే, ఎగ్జిట్ పోల్స్ తెలియాలంటే జూన్ 1 సాయంత్రం 6 గంటల వరకు ఆగాల్సిందే.