Hijab row: విద్యాసంస్థలకు సెలవుల పొడిగించిన కర్నాటక ప్రభుత్వం
- By HashtagU Desk Published Date - 10:06 AM, Sat - 12 February 22
కర్ణాటకలో హిజాబ్ వివాదానికి ఇప్పట్లో బ్రేక్ పడే సూచనలు కనిపించడంలేదు. కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సంస్థలను తెరిచేందుకు ధైర్యం చాలడం లేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16వ తేదీ వరకు కర్ణాటకలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్నాటకలో రగడ లేపిన హిజాబ్ వివాదం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో హైకోర్టులో వచ్చే సోమవారం హిజాబ్ వివాదం పై విచారణ జరగనుందని సమాచారం. ఇక సోమవారం నుంచి కళాశాలలు తెరవాలని హైకోర్టు ఆదేశిస్తూ, విద్యాసంస్థల్లో యూనిఫారంను మాత్రమే అనుమతించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో హిజాబ్, కాషాయం లేకుండా విద్యార్ధులు కళాశాలలకు వచ్చేలా చర్యలు తీసుకుని, విద్యాసంస్థలు తెరవాలని హైకోర్టు ఆదేశించింది. అయితే అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, విద్యాసంస్థలకు ఈ నెల 16 వరకు సెలవులను పొడిగించాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈలోపు న్యాయస్థానాల నుంచి తీర్పు వెలువడే అవకాశముంది. కాగా హిజాబ్ వివాదంపై జోక్యానికి సుప్రీం కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.
Related News
SIT Launches Helpline: లైంగిక బాధితుల కోసం సిట్ హెల్ప్లైన్ నంబర్
హసన్ జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తుంది. ఇప్పుడు బాధిత మహిళలు స్వయంగా ప్రత్యేక దర్యాప్తు శాఖను సంప్రదించి తమ బాధలను చెప్పుకునే అవకాశం కల్పించింది ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్.