Encounter: జమ్మూలో జవాన్ల చేతిలో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా బలగాల ఆపరేషన్ నిరంతరం కొనసాగుతోంది. శుక్రవారం మరోసారి భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
- Author : Praveen Aluthuru
Date : 05-05-2023 - 12:15 IST
Published By : Hashtagu Telugu Desk
Encounter: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా బలగాల ఆపరేషన్ నిరంతరం కొనసాగుతోంది. శుక్రవారం మరోసారి భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
శుక్రవారం రాజౌరీ జిల్లాలోని కండి ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్లో ఉగ్రవాదులు మరియు భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో జవాన్లు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ అధికారి గాయపడ్డారు. గాయపడిన అధికారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
పూంచ్లో ఉగ్రదాడి జరిగినప్పటి నుండి, ఉగ్రవాదులపై జవాన్లు ఫోకస్ చేశారు . బుధ, గురు, శుక్రవారాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గాలింపు చర్యలు చేపట్టాయి. లోయలో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి సైన్యం నిరంతరం భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. అలర్ట్ మోడ్లో సైన్యం నిరంతరం ఉగ్రవాదులను నిర్మూలిస్తోంది.
లోయలోని భద్రతా బలగాలు, పోలీసులపై ఉగ్రవాదులు నిరంతరం దాడులు చేస్తున్నారు. దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా బిజ్బెహరా ప్రాంతంలో గురువారం ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు పోలీసులపై దాడి చేయగా ఒక పోలీసు గాయపడ్డాడు. ఈ ఘటన ఉగ్రవాదుల కోసం సైన్యం గాలిస్తుంది. దాడి జరిగినప్పటి నుంచి ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసు బలగాలు కూడా గాలింపు చర్యలు చేపట్టాయి.
Read More: Harish Rao: మోడీ రాష్ట్రపతిని పిలుస్తున్నారా? గవర్నర్ పై హరీశ్ రావు ఫైర్!