Drug Overdose: ఓవర్ డోస్ డ్రగ్స్ కారణంగా యువకుడు మృతి
హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్లో ఓ ప్రైవేట్ హోటల్లో బస చేస్తున్న యువకుడు డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న సివిల్లైన్ పోలీస్స్టేషన్, ఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. యువకుడి మృతదేహం నుంచి మందు ఇంజక్షన్ను స్వాధీనం చేసుకున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 16-06-2024 - 10:02 IST
Published By : Hashtagu Telugu Desk
Drug Overdose: హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్లో ఓ ప్రైవేట్ హోటల్లో బస చేస్తున్న యువకుడు డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న సివిల్లైన్ పోలీస్స్టేషన్, ఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. యువకుడి మృతదేహం నుంచి మందు ఇంజక్షన్ను స్వాధీనం చేసుకున్నారు.
జింద్ జిల్లా కాల్వా గ్రామానికి చెందిన ప్రదీప్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. శనివారం రోహ్తక్ కొత్త బస్టాండ్లోని ఓ ప్రైవేట్ హోటల్లో రాత్రి బస చేశారు. ఆదివారం ఉదయం ప్రదీప్ గది తలుపులు తెరవలేదు. అనంతరం తలుపులు పగులగొట్టి చూడగా ప్రదీప్ మృతదేహం నేలపై పడి ఉంది. మృతదేహం నుంచి నిషేధిత ఇంజక్షన్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాతే అంతా వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం రోహ్తక్ పీజీఐకి తరలించారు.
మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. యువకుడి శరీరంపై ఎటువంటి గాయం లేదు. ప్రాథమిక విచారణలో యువకుడు డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది.
Also Read: Viswak Sen: విశ్వక్ సేన్ సంచలన నిర్ణయం.. శభాష్ అంటున్న నెటిజన్స్