MLA Suryanarayana Reddy : వీరులమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి
- Author : Sudheer
Date : 16-01-2024 - 4:14 IST
Published By : Hashtagu Telugu Desk
సంక్రాంతి ని పురస్కరించుకుని అనపర్తి గ్రామదేవత వీరులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్. సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు సోమవారం వీరుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులకు ఆలయ కమిటీ ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి , అమ్మవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ దశరథ రామారెడ్డి పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సీనియర్ డాక్టర్ గా ఈయనకు గుర్తింపు ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
భోగి పండుగ సందర్భంగా అనపర్తి వీరూళ్ళమ్మ ఆలయం వద్ద మహిళలకు చిన్నారులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు బహుమతులు అందజేశారు. అలాగే పేదవారికీ బ్లాకెట్స్ ఇచ్చి వారి గొప్ప మనసును చాటుకున్నారు.

ఇక సూర్యనారాయణ రెడ్డి విషయానికి వస్తే.. వైద్య వృత్తిలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావంతో వైసీపీలో చేరి 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి 1,373 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాయడు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పై 55207 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. నియోజకవర్గంలో సూర్యనారాయణ రెడ్డి ఎన్నో అభివృద్ధి పనులు చేసి..ఎంతో పేరు తెచ్చుకున్నారు.
Read Also : Hanuman : అదరగొడుతున్న హనుమాన్.. 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ.. నాలుగు రోజుల్లోనే..