Simhachalam: సింహాచలం ఆలయంలోకి కుక్క ప్రవేశం, 2 గంటల పాటు మూసివేత
ఓ కుక్క కారణంగా భక్తుల దర్శనానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా
- By Balu J Published Date - 12:19 PM, Fri - 27 October 23
Simhachalam: విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలోకి గురువారం కుక్క చొరబడింది. అయితే ఇది ఆలయ పవిత్రతను దెబ్బతీసినట్లేనంటూ అధికారులు రెండు గంటల పాటు దర్శనాన్ని నిలిపివేశారు. ఆలయ అర్చకులు సంప్రోక్షణ వ్రతం చేసే వరకు భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఆలయాన్ని భక్తుల కోసం తెరిచారు. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వీధికుక్క ఆలయంలోకి ప్రవేశించిందని భక్తులు ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో సింహాచలం ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. నిత్యం ఎంతో మంది భక్తులు దైవ దర్శనానికి వస్తుంటారు.
Also Read: Winter Foods: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే..!
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.