Vande Bharat: హైదరాబాద్-బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ టికెట్ ధర ఎంతో తెలుసా?
- Author : Balu J
Date : 22-09-2023 - 11:39 IST
Published By : Hashtagu Telugu Desk
Vande Bharat: కాచిగూడ, యశ్వంత్పూర్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్లో టికెట్ ధర రూ.2,800 ఉంటుందని వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. చైర్ కార్ రైడ్కు దాదాపు రూ.1,500 ఉంది. క్యాటరింగ్ సదుపాయంతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఛార్జీలు నిర్ణయించారు. సెప్టెంబరు 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సర్వీసును ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. ఇది మహబూబ్నగర్-కర్నూల్-గూటీ మార్గంలో హైదరాబాద్-బెంగళూరు మధ్య ఎనిమిది గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది. విశాఖపట్నం, తిరుపతికి రైళ్ల తర్వాత నగరంలో వందేభారత్ సర్వీస్ ఇది మూడోది.
Also Read: Ticket Fight: తగ్గేదేలే.. వరంగల్, కరీంనగర్ అసెంబ్లీలో బరిలోకి 16 మంది మహిళలు