Delhi Excise Policy Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు 3 రోజుల కస్టడీ
మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది . విచారణ నిమిత్తం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ను ఐదు రోజుల కస్టడీకి
- Author : Vamsi Chowdary Korata
Date : 26-06-2024 - 11:33 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Excise Policy Case: మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది . విచారణ నిమిత్తం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ చేసిన దరఖాస్తుపై న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు రోజు సీఎం కేజ్రీవాల్ను రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా సీబీఐ అధికారికంగా అరెస్టు చేసింది. తీహార్ జైలులో సిఎం కేజ్రీవాల్ను విచారించిన అనంతరం బుధవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు సిబిఐకి అనుమతి లభించింది.
తనను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సహా తమ పార్టీ నేతలెవరినీ తాను నిందించలేదని చెప్పారు. కోర్టును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. దేశ రాజధానిలో అధికార పార్టీ మరియు ఆప్ నాయకుల ప్రతిష్టను దిగజార్చడానికి సీబీఐ వర్గాలు మీడియాలో తప్పుడు కథనాన్ని సృష్టిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
Also Read: T20 World Cup Semifinal: మరో ప్రతీకారానికి వేళాయే ఇంగ్లాండ్ తో సెమీస్ కు భారత్ రెడీ