Cyclone Biparjoy : 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బైపార్జోయ్.. 4 రాష్ట్రాలపై ఎఫెక్ట్
'బైపర్ జోయ్' తుఫానుపై భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం తాజా అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం తూర్పు-మధ్య అరేబియా సముద్రం, ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఉన్న 'బైపర్ జోయ్' తుఫాను(Cyclone Biparjoy).. తదుపరిగా ఉత్తరం దిశకు మళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
- By Pasha Published Date - 12:11 PM, Wed - 7 June 23
‘బైపర్ జోయ్’ తుఫానుపై భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం తాజా అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం తూర్పు-మధ్య అరేబియా సముద్రం, ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఉన్న ‘బైపర్ జోయ్’ తుఫాను(Cyclone Biparjoy).. తదుపరిగా ఉత్తరం దిశకు మళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత.. వచ్చే 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారొచ్చని IMD అంచనా వేసింది. ఒకవేళ ఈ మార్పు సంభవిస్తే గాలి వేగం గంటకు 145 కి.మీ వరకు ఉంటుందని పేర్కొంది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో గాలి వేగం గంటకు 160 కి.మీ వరకు పెరుగుతుందని తెలిపింది.
4 రాష్ట్రాలపై ఎఫెక్ట్..
జూన్ 11 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళొద్దని IMD సూచించింది. ప్రస్తుతం ‘బైపర్ జోయ్’ తుఫాను(Cyclone Biparjoy) గోవాకు పశ్చిమ-నైరుతి దిశగా 900 కి.మీ దూరంలో, ముంబైకి నైరుతి దిశగా 1020 కి.మీ దూరంలో, పోర్బందర్కు నైరుతి దిశగా 1090 కి.మీ దూరంలో, కరాచీకి దక్షిణంగా 1380 కి.మీ దూరంలో ఉందని IMD వెల్లడించింది. ‘బైపర్ జోయ్’ తుఫాను ప్రభావం ఉత్తర కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాలపై ఉండొచ్చని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల పాటు బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ వార్నింగ్స్ జారీ చేసింది.
Severe cyclonic storm Biparjoy over eastcentral and adjoining southeast Arabian Sea lays about 890 km west-southwest of Goa. It is likely to move nearly northwards and intensify into a very severe cyclonic storm during the next 24 hrs: India Meteorological Department pic.twitter.com/1Ki5CnXN9p
— ANI (@ANI) June 7, 2023
మత్స్యకారులకు హెచ్చరికలు జారీ
జూన్ 10 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని IMD హెచ్చరించింది. ఉత్తర, దక్షిణ అరేబియా సముద్రం యొక్క మధ్య, పరిసర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్ళొద్దని పేర్కొంది. ప్రత్యేకించి జూన్ 8 నుంచి 10 వరకు అలర్ట్ గా ఉండాలని తెలిపింది. జూన్ 6, 7 తేదీల్లో కేరళ-కర్ణాటక తీరాలు, లక్షద్వీప్-మాల్దీవుల ప్రాంతాల్లోని మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలి. కొంకణ్-గోవా-మహారాష్ట్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు జూన్ 8 నుంచి జూన్ 10 వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Tags
Related News
Deve Gowda : కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా కలిసి పనిచేస్తాంః హెచ్డీ దేవెగౌడ
Loksabha Elections 2024 : కర్ణాటక(Karnataka)లో మొత్తం 28 సీట్లను బీజేపీ( BJP), జేడీఎస్(JDS) కైవసం చేసుకుంటాయని మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ(HD Deve Gowda) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్(Congress) ఓటమి లక్ష్యంగా తాము కలిసి పనిచేస్తామని అన్నారు. బీజేపీ, జేడీఎస్ సమన్వయ కమిటీ తొలిసారి భేటీ అయిందని, నేతలందరూ ఈ సమావేశానికి హాజరై కర్ణాటక ప్రజలకు సానుకూల సంకేతాలు పంపార�