Corona Cases: కరోనా పైపైకి.. దేశంలో 4 వేలు దాటిన కోవిడ్ కేసులు
ఇటీవల మరోసారి కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
- By Balu J Published Date - 11:09 AM, Wed - 5 April 23
దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. ఇటీవల మరోసారి కొత్తకేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో భారతదేశంలో బుధవారం 4,435 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. నిన్న1,31,086 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,435 కేసులు వచ్చాయి.
దాంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.38శాతానికి చేరింది. గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 23,091(0.05శాతం)కి ఎగబాకాయి. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మొత్తం మృతుల సంఖ్య 5,30,916గా ఉంది. ఇప్పటివరకూ 220.6 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
Related News
Raw Officer : గురుపత్వంత్ హత్యకు ‘రా’ అధికారి కుట్ర.. భారత్ స్పందన ఇదీ
Raw Officer : గురుపత్వంత్ సింగ్ పన్నూ.. ఇతడు ఖలిస్తాన్ ఉగ్రవాది. అమెరికా ఇతగాడికి ఆశ్రయం ఇస్తోంది.