Congress Protest : జీఎస్టీ పెంపు, అగ్నిపథ్పై పార్లమెంట్ లో కాంగ్రెస్ నిరసన
జీఎస్టీ, ధరల పెరుగుదల, అగ్నిపథ్ స్కీమ్పై కాంగ్రెస్ సోమవారం పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టనుంది. ప్రాంగణంలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు
- By Prasad Published Date - 10:09 AM, Tue - 19 July 22
న్యూఢిల్లీ: జీఎస్టీ, ధరల పెరుగుదల, అగ్నిపథ్ స్కీమ్పై కాంగ్రెస్ సోమవారం పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టనుంది. ప్రాంగణంలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు.ధరల పెరుగుదల, జీఎస్టీపై చర్చ జరగాలన్న డిమాండ్ నేపథ్యంలో సోమవారం ఉభయ సభలు జరగలేదు. రాజ్యసభ, వర్షాకాల సమావేశాల మొదటి రోజు సోమవారం అగ్నిపథ్, జిఎస్టి రేట్ల పెంపు, ఇతర అంశాలపై చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ విపక్ష బెంచ్లు తీవ్ర నిరసనలతో సభను రోజంతా వాయిదా వేయడానికి దారితీసింది. సాయుధ దళాలకు అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకం, జీఎస్టీ పెంపు, ధరల పెరుగుదల తదితర అంశాలపై చర్చించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, ఇతర ప్రతిపక్ష సభ్యులు నోటీసులు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన విపక్షాల నోటీసులను ఆమోదించలేదు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తన పదవీ కాలం చివరి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ తన పదవీకాలంలో 57 శాతం సభలు పాక్షికంగా అంతరాయం కలిగి ఉన్నాయని అన్నారు. అదేవిధంగా లోక్ సభలో ధరల పెరుగుదల అంశాన్ని లేవనెత్తడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
Related News
Zomato: జొమాటోకు బిగ్ షాక్.. రూ. 8 కోట్లు డిమాండ్ చేస్తున్న గుజరాత్ జీఎస్టీ డిపార్ట్మెంట్..!
ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో (Zomato) కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూసే అవకాశముంది. గుజరాత్లోని జిఎస్టి డిపార్ట్మెంట్ నుండి కంపెనీ పెనాల్టీ నోటీసును అందుకుంది.