JP Nadda: అయోధ్య రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది!
- By Balu J Published Date - 11:57 PM, Mon - 6 May 24
JP Nadda: కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎఐఎంఐఎం ముస్లిం లీగ్ ఎజెండాను అనుసరిస్తున్నాయని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం ఆరోపించారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మైనార్టీల మద్దతుదారులని, మూడు పార్టీలు రజాకార్ల మద్దతుదారులని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని తాము జరుపుకోలేమని ఆయన అన్నారు. 1948 సెప్టెంబర్ 17ను బీజేపీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఏటా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ను రామ వ్యతిరేక, సనాతన వ్యతిరేక పార్టీగా అభివర్ణించిన ఆయన దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిందని ఆరోపించారు.
ఇటీవల జరిగిన ఉగ్రదాడిని బీజేపీ ఎన్నికలకు ముందు చేసిన స్టంట్ గా అభివర్ణించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ లో దేశ వ్యతిరేక నేతలు ఉన్నారన్నారు. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించిందని బీజేపీ అధ్యక్షుడు నడ్డా అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్ యూ)లో జాతి వ్యతిరేక నినాదాలు చేస్తున్న వారికి రాహుల్ గాంధీ అండగా నిలుస్తున్నారని ఆరోపించారు.
Related News
Liquor తెలంగాణలో కొత్త బీర్లు..? ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగాటం – బిఆర్ఎస్
గతంలో సోమ్ డిస్టిలరీస్స్ కంపెనీ కారణంగా మధ్యప్రదేశ్లో 65 మంది చనిపోయారు. తాజాగా తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది