TS CM KCR : ఆ జిల్లాలో సెప్టెంబర్ 5న సీఎం పర్యటన ఖరారు..!!
తెలంగాణలో మహాసంగ్రామపాదయాత్ర పేరుతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు పెంచారు. వరుసగా భారీబహిరంగ సభలు నిర్వహిస్తూ సత్తా చాటింది.
- By hashtagu Published Date - 11:45 AM, Tue - 30 August 22
తెలంగాణలో మహా సంగ్రామ పాదయాత్ర పేరుతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు పెంచారు. వరుసగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ సత్తా చాటింది ఆ పార్టీ. ఈ నేపథ్యంలో అధికార టీఆరెస్ పార్టీ…బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలతో బిజీబిజీగా మారారు. సోమవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి…సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లాలో పర్యటించున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎల్లమ్మగుట్టలో నూతనంగా నిర్మించిన టీఆరెస్ భవనాన్ని, కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తర్వాత గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొన ప్రసంగిస్తారు.
ఇక సీఎం పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి సోమావారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ నాగరాజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలో కలిసి పర్యటించారు. కొత్త కలెక్టరేట్ భవనంతో పాటు గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్ సభ జరిగే స్థలాన్ని చూశారు. వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలుగా అనువైన స్థలాన్ని ఎంపికు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వర్షం కురుస్తే…ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
Related News
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మైలురాయి.. 50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చిన మెట్రో
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ గురువారం నాటికి 50 కోట్ల రైడర్షిప్ మార్క్ను అధిగమించిందని తెలిపింది.