CM KCR: రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 12:31 PM, Sat - 16 July 22
గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో ధన, ప్రాణ నష్టం బాగానే జరిగింది. వేల ప్రాజెక్టులకు నీరందించే డ్యాములు సైతం డెంజర్ జోన్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. నిర్మల్లోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నుంచి భద్రాచలం, గోదావరి నది వరద ప్రభావిత ప్రాంతాల వరకు ఏరియల్ సర్వేను ముఖ్యమంత్రి కొనసాగించనున్నారు.
ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉంటారు. కేసీఆర్ టూర్ ఖరారు కావడంతో అధికారులు ఏరియల్ సర్వే మార్గం, ఇతర ఏర్పాట్లు చేసేందుకు నిమగ్నమవుతున్నారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి గోదావరి నది వరద ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని ఆసుపత్రుల వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు సమావేశం నిర్వహిస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తు, గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు రేపు (ఆదివారం) ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
(File Photo) pic.twitter.com/bhiD0oANHf
— Telangana CMO (@TelanganaCMO) July 16, 2022
Related News
KTR: డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ ను శిక్షించాలా? వద్దా? : కేటీఆర్
KTR: వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు లో జరిగిన సన్నాహాక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ కార్యక్రమాలు చేసినా మనం పట్టించుకోలేదు. ప్రభుత్వం లో ఉండి ఐదునెలల్లో రేవంత్ రెడ్డి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అయినప్పటికీ సిగ్గు లేకు�