Bhatti Vikramarka : వైఎస్ఆర్ పాదయాత్రను తలపిస్తున్న భట్టి పీపుల్స్ మార్చ్.. అడుగడుగునా జన నీరాజనం
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా రాష్ట్రంలో మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. రాష్ట్ర విభజన అనంతరం రెండు
- By Prasad Published Date - 05:07 PM, Mon - 19 June 23
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా రాష్ట్రంలో మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. రాష్ట్ర విభజన అనంతరం రెండు సార్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈ సారి ఎలాగైన అధికారం చేజిక్కుంచుకోవాలని చూస్తుంది. ఇందుకోసం నేతలంతా చెమటోడుస్తున్నారు. ముఖ్యనేతలంతా పాదయాత్రల పేరుతో జనంలో తిరుగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో నిలబెట్టింది ఈ పాదయాత్రలే. జనం మధ్యలో జన నేత అంటే ముందుగా గుర్తు వచ్చేది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ్ల ముందు కదలాడతారు. తలపై పాగా, తెల్లటి పంచె, స్వచ్ఛతలో ఒక దానితో ఒకటి పోటీ పడే ఆయన లాల్చీ, చిరు నవ్వులు.. మనల్ని గతంలోకి తీసుకు వెళ్లిపోతాయి.
రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నాడు కాంగ్రెస్ ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే తలపాగా, అదే చిరునవ్వుతో జనంలోకి పీపుల్స్ మార్చ్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర చేపట్టారు. ఆయన ప్రస్తుతంలో ఎర్రటి ఎండల్లోనూ జనం మధ్య, జనంతో మమేకం అవుతున్నారు. మార్చ్ లో ప్రారంభమైన భట్టి విక్రమార్క పాదయాత్ర దివంగత రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలా జనంలో తలపిస్తూ ముందుకు సాగుతోంది. వైఎస్ లాగే పంచెకట్టుతో, భరోసా ఇచ్చే చిరు నవ్వుతో, రైతుల్లో రైతుగా మారిపోయి సమస్యలు వింటున్నారు. జనం ఆయనతో తమ కష్ట, నష్టాలు చెప్పుకుంటున్నారు. మరో మారు రాజన్న రాజ్యాన్ని కాంగ్రెస్ మార్కు పథకాలు, పాలనతో తాను తీసుకు వస్తానని భట్టి విక్రమార్క సూటిగా, స్పష్టంగా చెబుతున్నారు.
పేదల గోడు వినని ప్రస్తుత దొరల పాలనకు తమ ప్రభుత్వం పూర్తి భిన్నంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ ల్లోనే తొమ్మిదేళ్లు గడిపేసిన కేసీఆర్ తన రాజ ప్రాసాదాల్లోకి కామన్ మ్యాన్ కి నో ఎంట్రీ అనేశాడని ఆరోపించారు. సచివాలయంలోకి కూడా సామాన్యుడు రాకుండా పోలీసుల్ని కాపాలా పెట్టేరని.. కాంగ్రెస్ వస్తే రాజశేఖర్ రెడ్డి హయాంలో మాదిరిగా ప్రజాదర్భార్, రచ్చబండ కార్యక్రమాలు పునః ప్రారంభం అవుతాయని భట్టి అంటున్నారు. జనం సీఎం వద్దకు కాకుండా.. సీఎం జనం వద్దకు వచ్చి తీరుతాడని ఆయన హామీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని.. పేదలకు ఆపన్న హస్తం అందిస్తామని మల్లు భట్టి విక్రమార్క అంటున్నారు.
Related News
Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది