Gold- Silver: పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు మరోసారి తగ్గాయి.
- By Gopichand Published Date - 07:40 AM, Thu - 7 September 23
Gold- Silver: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు మరోసారి తగ్గాయి. గురువారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,000గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.78,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (సెప్టెంబర్ 07, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Cricket Question: కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్ కు సంబంధించిన ప్రశ్న.. సమాధానం ఏంటో తెలుసా..?
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,200గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,300 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,330గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,000 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,700 ఉండగా, ముంబైలో రూ.74,700గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.78,500 ఉండగా, కోల్కతాలో రూ.74,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,750 ఉండగా, కేరళలో రూ.78,500గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.78,500 ఉండగా, విజయవాడలో రూ.78,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Air India Express: ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తున్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. 90 కంటే ఎక్కువ విమానాలు రద్దు..!
బుధవారం (మే 8) ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 90 కంటే ఎక్కువ విమానాలు రద్దు చేయబడ్డాయి. దీని కారణంగా వేలాది మంది ప్రయాణికులు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.