Gannavaram : వైసీపీ అరాచకాలపై గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలి – టీడీపీ అధినేత చంద్రబాబు
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతల దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని
- By Prasad Published Date - 08:09 PM, Mon - 20 February 23
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతల దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారని.. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? అని ప్రశ్నించారు. సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణనని… రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని..కారకుల పై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Related News
Bharathi Reddy : భారతి రెడ్డే కాదు.. నీ దగ్గర సమాధానం ఉన్న చెప్పు జగన్..?
ఏపీలో ఎన్నికల వేళ తమ వారిని గెలిపించుకునేందుకు నడుం బిగించి ప్రచారంలో పాల్గొంటున్నారు కుటుంబ సభ్యులు.