CBN: కృష్ణ కు నివాళుర్పించిన చంద్రబాబు
నానక్ రామగూడలోని కృష్ణ పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మహేశ్ బాబు, నరేశ్, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కృష్ణతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
- By CS Rao Published Date - 03:40 PM, Tue - 15 November 22
నానక్ రామగూడలోని కృష్ణ పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మహేశ్ బాబు, నరేశ్, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కృష్ణతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
సుమారు 15 నిమిషాల పాటు మహేష్ బాబు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘట్టమనేని కుటుంబానికి సానుభూతిని తెలియచేసి, వాళ్లకు ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కృష్ణ కుమార్తె మంజులతో కొద్దిసేపు మాట్లాడారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆయన వెంట ఉన్నారు. నివాళులర్పించిన తరువాత కృష్ణ సాహసం, ధైర్యం గురించి మీడియాతో పంచుకున్నారు. సినిమా రంగానికి ఐకాన్ గా నిలిచారని కొనియాడారు. అత్యధిక అభిమాన సంఘాలు ఉన్న హీరోగా కృష్ణను ప్రశంసించారు. ఆయన స్పూర్తిని హీరో మహేష్ నిలిపే దేవుడు అండగా ఉండాలని ఆకాంక్షించారు.
Related News
Chandrababu : నేడు కర్నూలు, నెల్లూరు లో చంద్రబాబు ప్రచారం
రాయలసీమలో ఈసారి అత్యధిక స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఆయన పర్యటనలు సాగుతున్నాయి