Hyderabad : ఎన్నారైని మోసం చేసిన అంబర్పేట ఎస్ఐ.. కేసు నమోదు
ఎన్నారైని మోసం చేసిన కేసులో ఓ ఎస్ఐపై కేసు నమోదు అయింది. అంబర్పేట్ ఇన్స్పెక్టర్పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో
- By Prasad Published Date - 06:42 AM, Sun - 8 January 23
ఎన్నారైని మోసం చేసిన కేసులో ఓ ఎస్ఐపై కేసు నమోదు అయింది. అంబర్పేట్ ఇన్స్పెక్టర్పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఎన్నారైని రూ.54 లక్షలు మోసం చేశాడని కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ సుధాకర్, సస్పెండ్ అయిన పోలీసుతో కలిసి తహశీల్దార్ తమకు వ్యక్తిగతంగా తెలుసునని చెప్పి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ఎన్ఆర్ఐ నుంచి ఆ మొత్తాన్ని తీసుకున్నారని బాధితుడు ఆరోపించారు. డబ్బులు ఇచ్చినప్పటికీ బాధితుడి సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఇన్స్పెక్టర్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకునేందుకు బాధితుడు ప్రయత్నించాడు. డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో బాధితుడు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 420, 406, 467 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Related News
Errabelli Dayakar Rao: భూకబ్జా ఆరోపణలపై స్పందించిన ఎర్రబెల్లి
తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు.