Bus Accident : ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి
విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, ఒక మహిళ
- By Prasad Published Date - 11:00 AM, Mon - 21 November 22
విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, ఒక మహిళ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ వాహనం నడుపుతుండగా స్పృహతప్పి పడిపోవడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సు అదుపుతప్పి 7వ తరగతి విద్యార్థిని ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఆ తర్వాత వాహనం ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Related News
AP EAMCET 2024 Exam: ఏపీలో రేపటి నుంచి EAPCET 2024 పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ( EAPCET ) పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి.