BRS MLA Jeevan Reddy: మాది ఫైటర్స్ ఫ్యామిలీ.. బీజేపీది ఛీటర్స్ ఫ్యామిలీ!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు
- By Balu J Published Date - 02:30 PM, Thu - 22 December 22
కేసీఆర్, కేటీఆర్, కవిత రాక్ స్టార్స్ అని. బండి సంజయ్, అరవింద్ లు ఫేక్ స్టార్స్,జోక్ స్టార్స్ అని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ ఎస్ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. “బీఆర్ ఎస్ అంటే బడుగు,బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం. బీఆర్ ఎస్ అంటే భారత రక్షణ సమితి అని ఆయన అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రత్యర్థులను లొంగదీసుకోవడమే బీజేపీ సిద్ధాంతమా.? బీజేపీ హయాంలో ఈడీ, ఐటీ, సీబీఐ లు నమోదు చేసిన కేసుల్లో ఒక్క శాతమైనా నిలిచాయా?. బీజేపీకి సరెండర్ అయిన వారిపై కేసులు లేకుండా చేయలేదా? ఇదేనా కమల నాధుల నీతి’’ అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ సైగ చేస్తే చాలు బీఆర్ ఎస్ సైన్యం బీజేపీని తరిమికొడుతుంది. కేసీఆర్ తో గోక్కున్నోడెవడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. కేసీఆర్ తెలంగాణ సాధించిన ఉద్యమ నేత. అభివృద్ధి ప్రధాత. నాలుగు దిక్కులా వెలుగునిచ్చే సూర్యుడు. కేసీఆర్ మూడు పేజ్ ల కరెంటు. ముట్టుకుంటే మాడి మసైపోతారు’’ అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
‘‘ డ్రగ్ ఆరోపణలు నిరూపించక పోతే మీ చెప్పుతో మీరే కొట్టుకుంటారా అని కేటీఆర్ సవాల్ చేసిండు. కేటీఆర్ సవాల్ ను స్వీకరించే దమ్ము బండికి, అరవింద్ కు ఉందా? కేటీఆర్ మచ్చలేని నేత. అరవింద్ , బండి సంజయ్ బతుకే రోత. కేటీఆర్ అభివృద్ధి కి బ్రాండ్ అంబాసిడర్. వీళ్లిద్దరూ కేటుగాళ్లకు బ్రాండ్ అంబాసిడర్లు. ఎక్కడా బండి సంజయ్ కు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తప్ప ప్రజలు సమస్యల్లో ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో తీవ్ర అసహనానికి లోనై నోటికి పని చెబుతుండు.తొండి మాటల బండికి తోడు అరగుండు అరవిందొకడు జమ అయ్యిండు. ఈ ఇద్దరు చెప్పేవి శ్రీరంగ నీతులు. నోరు తెరిస్తే బండ బూతులు’’ అని జీవన్ రెడ్డి బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు.
Related News
Harish Rao: ప్రభుత్వ హాస్టళ్ల ఫుడ్ పాయిజన్ ఘటనలపై హరీశ్ రావు రియాక్షన్.. కాంగ్రెస్పై ఫైర్
Harish Rao: తెలంగాణ ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనలపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. మొన్న భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతాన్ని మరవక ముందే మరో ఫుడ్ పాయిజన్ ఉదంతం వెలుగులోకి వచ్చిందని హరీశ్ రావు అన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో శుక్రవారం 11 మంది వి�