Kohinoor: కోహినూర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్..!
బ్రిటన్ (Britain) యువరాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరుగుతోంది.
- By Maheswara Rao Nadella Published Date - 07:49 PM, Wed - 15 February 23
బ్రిటన్ యువరాజుగా చార్లెస్ – 3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ రాజవంశం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ (Kohinoor) వజ్రాన్ని ధరించకూడదని నిర్ణయించింది. ఈ కిరీటానికి బదులు క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నట్టు సమాచారం . పట్టాభిషేకం సమయంలో రాణి కెమిల్లా కిరీటధారణ కార్యక్రమంలో ఈ వజ్రాన్ని ధరించాలని తొలుత భావించినా… చివరకు ఆ ఆలోచనను పక్కనపెట్టారు. క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నారు. ఈ కిరీటంలో క్వీన్ ఎలిజబెత్2కి చెందిన నగలను కిరీటంలో పొదగనున్నారు.
ఇక క్వీన్ ఎలిజబెత్ 2 కిరీటంలో కోహినూర్ (Kohinoor) వజ్రం ఉండేది. దాదాపు 7 దశాబ్దాల పాటు ఆమె మరణించే దాకా ఆమె కిరీటంలో వజ్రం ఉంది. కోహినూర్ వజ్రం మన దేశానికి చెందినది అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ తో దౌత్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కోహినూర్ ను ధరించకూడదని రాణి కెమిల్లా నిర్ణయించినట్టు సమాచారం.
Also Read: India Become World No. 1 in Cricket: మేమే నెంబర్ 1..
Related News
Indian Military: మాల్దీవుల నుంచి వెనక్కి వచ్చేసిన భారత సైనికులు..!
మాల్దీవుల నుంచి భారత్ తన సైనికులందరినీ ఉపసంహరించుకుంది. మాల్దీవుల ప్రభుత్వం శుక్రవారం ఈ సమాచారాన్ని వెల్లడించింది.