Madhya Pradesh : మధ్యప్రదేశ్లో బోరుబావిలో పడ్డ బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో బోరుబావిలో బాలుడు పడిపోయాడు. సాయంత్రం పొలంలో ఆడుకుంటూ ఎనిమిదేళ్ల బాలుడు
- By Prasad Published Date - 07:02 AM, Wed - 7 December 22
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో బోరుబావిలో బాలుడు పడిపోయాడు. సాయంత్రం పొలంలో ఆడుకుంటూ ఎనిమిదేళ్ల బాలుడు లోతైన బోరుబావిలో పడిపోయాడని.. జిల్లాలోని మాండవి గ్రామంలో సాయంత్రం 5 గంటలకు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం నానక్ చౌహాన్ అనే వ్యక్తి పొలంలో బోరు వేశాడు. అయితే నీళ్లు పడకపోవడంతో ఆ బోరుబావిని పట్టాతో కప్పి ఉంచానని పొలం యాజమాని తెలిపాడు. అయితే బాలుడు కవర్ను ఎలా తొలగించగలిగాడో తనకు తెలియదని చౌహాన్ పోలీసులకు చెప్పాడు. బాలుడిని సురక్షితంగా బయటకు తీయడానికి ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ఆ ప్రాంతాన్ని తవ్వడానికి జేసీబీలు తెప్పించామని పోలీసులు తెలిపారు. బాలుడికి ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. SDRF బృందం భోపాల్, హోషంగాబాద్ నుండి రప్పించారు.
Tags
Related News
Madhya Pradesh: వైవాహిక శృంగారం నేరం కాదు
భార్యాభర్తల మధ్య జరిగే ఏ విధమైన లైంగిక కలయిక అత్యాచారం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో భార్య అంగీకారానికి సంబంధం లేదని, అందుకే అది అత్యాచారం కాదని కోర్టు పేర్కొంది.