AP Inter Results 2022 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏపీ ఇంటర్మీడియట్ 2022 ఫలితాలను విడుదల చేసింది.
- Author : CS Rao
Date : 22-06-2022 - 3:56 IST
Published By : Hashtagu Telugu Desk
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏపీ ఇంటర్మీడియట్ 2022 ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను విడుదల అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం నుంచి 2,41,591 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 2,58,449 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, రెండేళ్లలో బాలికలే అగ్రస్థానంలో నిలిచారని తెలిపారు.
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా 72 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, కడప 55 శాతంతో అత్యల్పంగా నిలిచింది. జూన్ 25 నుంచి జూలై 5 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల కావడం గమనార్హం. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని వేగంగా, జాగ్రత్తగా పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్ bie.ap.gov.inలో చూడవచ్చు.