Singer KK No More: బాలీవుడ్ గాయకుడు కేకే మృతి..
బాలీవుడ్ సింగర్ కేకే కన్నుమూశారు. 53 ఏళ్ల కేకే కోల్కతాలో ఓ సంగీత కచేరీలో పాల్గొంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
- By Hashtag U Published Date - 01:16 AM, Wed - 1 June 22

బాలీవుడ్ సింగర్ కేకే కన్నుమూశారు. 53 ఏళ్ల కేకే కోల్కతాలో ఓ సంగీత కచేరీలో పాల్గొంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కోల్కతాలో సాయంత్రం జరిగిన సంగీత కచేరీలో దాదాపు గంటసేపు వేదికపై పాడిన తర్వాత కేకే తన హోటల్కు చేరుకున్నారు.
అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. అయితే, కెకెను దక్షిణ కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. వారు అతనికి చికిత్స చేయకపోవడం దురదృష్టకరమని ఆసుపత్రి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కోల్కతాలోని నజ్రుల్ మంచాలో ప్రదర్శన ఇస్తున్నట్లు మే 31న ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అయితే కచేరీ మధ్యలో పడిపోవడంతో రాత్రి 10 గంటల సమయంలో కోల్కతాలోని సీఎంఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కేకే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆసుపత్రి వర్గాలు కూడా తెలిపాయి.
#WATCH | Singer KK died hours after a concert in Kolkata on May 31st. The auditorium shares visuals of the event held some hours ago. KK was known for songs like 'Pal' and 'Yaaron'. He was brought dead to the CMRI, the hospital told.
Video source: Najrul Manch FB page pic.twitter.com/YiG64Cs9nP
— ANI (@ANI) May 31, 2022
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని బహుముఖ గాయకులలో కెకె ఒకరు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా కేకేకు నివాళులర్పించారు.
ప్రధాని మోదీతో పాటు ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, గాయకులు రాహుల్ వైద్య, అర్మాన్ మాలిక్, హర్షదీప్ కౌర్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తదితరులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.
అయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ కేకేగా పేరుగాంచిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం బాధాకరం. ఆయన పాటలు అనేక రకాల భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి. కేకే పాటలు అన్ని వయసుల వారిని తాకాయి. ఆయనను పాటల ద్వారా మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా సానుభూతి. ఓం శాంతి” అని ప్రధాని ట్వీట్లో పేర్కొన్నారు.
Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 31, 2022