Afghan Migrants: తాలిబన్ల బాధలు తట్టుకోలేక అక్రమ వలసలు… 18 మంది ఆకలితో మృతి
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితిలో అనూహ్యమైన మార్పు వచ్చింది. మహిళలపై అనేక ఆంక్షలు విధించారు.
- Author : Praveen Aluthuru
Date : 24-05-2023 - 5:35 IST
Published By : Hashtagu Telugu Desk
Afghan Migrants: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితిలో అనూహ్యమైన మార్పు వచ్చింది. మహిళలపై అనేక ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా నిషేధించారు. అంతే కాకుండా ఆరో తరగతికి మించి చదువుకోనివ్వడం లేదు. అయితే, ఈ ఆంక్షలు తాలిబాన్ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా చాలా విమర్శలకు దారితీశాయి. దీంతో దేశం ఒంటరిగా మారింది. అదే సమయంలో దేశం ఆర్థిక సంక్షోభాన్ని మరియు కరువు ముప్పును ఎదుర్కొంటోంది.ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు దొంగతనంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు.
మొత్తం 40 మంది ఆఫ్ఘన్ వలసదారులు పశ్చిమ ఐరోపాకు చేరుకోవాలనే ఆశతో టర్కీ నుండి బల్గేరియాలోకి ప్రవేశించారు. అయితే ఆకలి, దాహం మరియు ఆక్సిజన్ లేకపోవడం వల్ల వారి పరిస్థితి మరింత దిగజారింది. దీని కారణంగా 40 మంది ఆఫ్ఘన్ వలసదారులలో 18 మంది మరణించారు. మిగిలిన వారి పరిస్థితి క్రిటికల్ గా మారింది. మరణించిన 18 మంది ఆఫ్ఘన్ వలసదారుల మృతదేహాలను బుధవారం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్కు తరలించారు. తాలిబన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు.
మొత్తం 18 మంది ఆఫ్ఘన్ వలసదారులు ఊపిరాడక మరణించారని అధికారులు ధృవీకరించారు. దాదాపు 40 మంది ఉన్న కంపార్ట్మెంట్లో దాక్కున్న వలసదారులను ట్రక్కు అక్రమంగా తీసుకువెళుతున్నట్లు బల్గేరియా అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. 40 మందిలో 18 మంది ఊపిరాడక మరణించగా, మిగిలిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బల్గేరియా నేషనల్ ఇన్వెస్టిగేషన్ సర్వీస్ డైరెక్టర్ బోరిస్లావ్ సరాఫోవ్ ఈ సంఘటనను “అసాధారణ మానవ విషాదం”గా అభివర్ణించారు. కాబూల్లో మంత్రిత్వ శాఖ డిప్యూటీ ప్రతినిధి జియా అహ్మద్ తకల్ మాట్లాడుతూ మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు తెలిపారు. ఇకపై ఆఫ్ఘన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
Read More: Parliament inauguration : పార్లమెంట్ ప్రారంభోత్సవ `బాయ్కాట్`పై BRS సందిగ్ధం