Blast in Afghanistan: ఆఫ్ఘనిస్థాన్లో భారీ పేలుడు.. 5 మంది మృతి..?
ఆఫ్ఘనిస్థాన్లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది.
- By Gopichand Published Date - 11:50 AM, Tue - 6 December 22

ఆఫ్ఘనిస్థాన్లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మజార్ ఏ షరీఫ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడ వరుసగా బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి.
ఆఫ్ఘనిస్థాన్లోని బాల్ఖ్ ప్రావిన్స్లో మంగళవారం పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది. మజార్-షరీఫ్ నగరంలోని మూడవ జిల్లాలోని సయ్యద్ అబాద్ కూడలిలో పేలుడు సంభవించిందని TOLO news నివేదించింది. ఆఫ్ఘన్ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఆయిల్ కంపెనీకి చెందిన ఉద్యోగులు ప్రయాణిస్తున్న వాహనంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం 5 మంది మరణించినట్లు సమాచారం.
బాల్ఖ్ ప్రావిన్స్లోని బస్సులో మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని ఉత్తర ఆఫ్ఘనిస్థాన్లోని బల్ఖ్ ప్రావిన్స్ పోలీసు ప్రతినిధి మహ్మద్ ఆసిఫ్ వజేరి తెలిపారు. ఈ వాహనం హెర్టెన్ ఆయిల్ కంపెనీ ఉద్యోగులది. పేలుడు వెనుక ఎవరున్నారో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదని ఆసిఫ్ అన్నారు. ఇటీవలి నెలల్లో ఆఫ్ఘనిస్తాన్లో అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
یک انفجار صبح امروز(سهشنبه) در چهار راهی سید آباد از مربوطات ناحیه سوم شهرمزارشریف رخ داده است. خبرنگار طلوعنیوز در مزارشريف میگوید که نیروهای امنیتی به محل رسیده اند.
درباره تلفات این رویداد جزئیات در
دسترس نیست.
مقامهای امنیتی تاکنون در این باره چیزی نگفته اند. pic.twitter.com/JpBdRBNvYB— TOLOnews (@TOLOnews) December 6, 2022