Biometric Cloning: వేలిముద్రలు హ్యాక్ చేసి.. ఖాతాలు ఖాళీ చేస్తున్నారు!
హ్యాకర్లు రెచ్చిపోతున్నారు.. చివరకు అమాయక ప్రజల ఫింగర్ ప్రింట్లను కూడా వదలడం లేదు.
- By Hashtag U Published Date - 04:11 PM, Sat - 7 May 22
హ్యాకర్లు రెచ్చిపోతున్నారు.. చివరకు అమాయక ప్రజల ఫింగర్ ప్రింట్లను కూడా వదలడం లేదు. ఫింగర్ ప్రింట్లను హ్యాక్ చేసి, ఆధార్ అనుసంధానిత చెల్లింపు వ్యవస్థ (Aeps) ద్వారా డబ్బులు కాజేస్తున్నారు. ఈ ముఠా కు చెందిన నలుగురు సభ్యులను మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు మధ్యప్రదేశ్ లోని పలు కస్టమర్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను సేకరిస్తారు. వాటిని తమ రహస్య కేంద్రాలకు తీసుకెళ్లి స్కాన్ చేసి.. వేలిముద్రలను క్లోన్ చేస్తారు. అనంతరం ఆ వేలిముద్రల సాయంతో Aeps మార్గంలో .. సదరు ఆధార్ కార్డుదారుడి బ్యాంకు ఖాతాలోకి లాగిన్ అవుతారు. అందులోని డబ్బులను ఎంచక్కా తమ ఖాతాలలోకి పంపించుకుంటారు.
Aeps ఏమిటి ?
దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆర్ధిక లావాదేవీలను సులువుగా చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన వ్యవస్థే Aeps (ఆధార్ అనుసంధానిత చెల్లింపు వ్యవస్థ). పాయింట్ ఆఫ్ సేల్స్ (pos), మైక్రో ఏటీఎం ల వద్ద కేవలం ఆధార్ నంబరును చెప్పి డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఇందులో ఉంటుంది.
Related News
Hyderabad: ధూల్పేటలో భారీగా నల్లమందు సీజ్.. మంత్రి జూపల్లి రియాక్షన్
Hyderabad: హైదరాబాద్ ధూల్పేటలో భారీగా నల్లమందును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. 1.5 కోట్ల విలువైన 160 కిలోల మందును పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ అధికారులను అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో మాదకద్రవ్యాల రహిత రాష్ట్రాంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు మం