Eternal Youth: నిత్యయవ్వనంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
సాధారణంగా మనిషి ఆహారం లేకుండా కొన్ని రోజులు పాటు జీవించగలడేమో కానీ నీరు లేకుండా మాత్రం ఎక్కువ
- By Nakshatra Published Date - 07:10 AM, Sat - 16 July 22
సాధారణంగా మనిషి ఆహారం లేకుండా కొన్ని రోజులు పాటు జీవించగలడేమో కానీ నీరు లేకుండా మాత్రం ఎక్కువ రోజులు జీవించలేడు. నీళ్లు లేకుండా ఎక్కువ రోజులు పాటు ప్రాణాలతో ఉండటం అన్నది అసాధ్యం చెప్పవచ్చు. శరీరంలో జీవక్రియలు సరిగా పనిచేయాలి అంటే నీరు తప్పనిసరి. అంతేకాకుండా ఒక వ్యక్తి రోజు వారీగా తీసుకొని నీటి పరిమాణం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే శరీరానికి సరిపడా నీరు తాగే వారి చర్మం ఎప్పుడూ కూడా కాంతివంతంగా ఉంటుంది.అయితే రోజులో కనీసం 2 లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగితేనే ఫలితాలు కనిపిస్తాయి.
శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవడం వల్ల చర్మం ఎలాస్టిసిటీ అలాగే కొనసాగుతుంది. దీంతో వృద్ధాప్యపు ఛాయలు పెద్దగా కనిపించవు అని అంటున్నారు నిపుణులు. అలాగే నీటిని తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో సరిపడా తాగకపోవడం వల్ల అనర్థాలు కూడా ఉన్నాయి. నీరు తక్కువగా తాగడం వల్ల బరువు పెరుగుతారు. కోపం వస్తుంటుంది. శక్తి చాలనట్టుగా ఉంటారు. చర్మం త్వరగా ముడతలు పడిపోతుంది. మానవ శరీరంలో 60 శాతం నీరే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మన శరీరంలో ఎన్నో క్రియలకు నీరు కావాలి.
శరీర ఉష్ణోగ్రత నిర్వహణ, శక్తి, జాయింట్లలో మృదుత్వం, హార్మోన్ల సాఫీ పనితీరు, పోషకాలు శరీరం అంతటికి అందడానికి నీరు కావాల్సిందే. మరి శరీరంలో అన్ని జీవక్రియలు సరిగా పని చేయాలి అంటే నీరు కూడా తగినంత తాగాలి. పుష్కలంగా తాగే వారికి వృద్ధాప్యపు ఛాయలు కొంత ఆలస్యంగానే కనిపిస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే కేవలం నీరు తీసుకుంటే వృద్ధాప్యం ఆలస్యం అవుతుందా? అని అంటే కాదు అని సమాధానం వినిపిస్తుంది. మనం తరచు తీసుకునే ఆహారం, జీవన శైలి, ఇతర ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా వృద్ధాప్యాన్ని నిర్ణయిస్తాయి. కాకపోతే అవన్నీ సరిగ్గా ఉండి, నీరు తగినంత లేకపోతే నష్టం జరుగుతుంది. కనుక వృద్ధాప్యపు ఛాయలు త్వరగా కనిపించడకుండా, యవ్వనంగా, ఉత్సాహంగా ఉండడంలో నీరు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలుసుకోవాలి.
Related News
Health: భయపెడుతున్న బీపీ.. అనారోగ్యానికి అసలు కారణమిదే
Health: రక్త పోటు బాధితుల సంఖ్య పెరుగుతుంది. బీపీతో బాధపడే వారి సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఇటీవల కన్జ్యూమర్ వాయిస్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా హెచ్చరించింది. భారత వైద్య పరిశోధనా మండలి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. పంజాబ్ రాష్ట్రాల్లో నిర్వహించిన ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్ సర్వేలో ఈ విషయం వెల్లడయింది. ప్రపంచవ్�