Baba: అమాయకులను నమ్మించి ఎనిమిదో పెళ్లి చేసుకోవాలనుకున్న బాబా.. చివరికి?
కాలం ఎంత ముందుకు వెళ్తున్నా కూడా మూఢనమ్మకాల విషయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. ఇప్పటికి కొందరు ప్రజలు మూఢనమ్మకాలకు బానిస గానే ఉన్నారు.
- By Nakshatra Published Date - 07:00 PM, Sun - 12 February 23
Baba: కాలం ఎంత ముందుకు వెళ్తున్నా కూడా మూఢనమ్మకాల విషయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. ఇప్పటికి కొందరు ప్రజలు మూఢనమ్మకాలకు బానిస గానే ఉన్నారు. రోజు వార్తలలో మూఢనమ్మకాల గురించి, దొంగ బాబాల గురించి ఎన్ని వార్తలు వచ్చినా కూడా ఎక్కడో ఒకచోట కొందరు మోసపోతూనే ఉన్నారు. అయితే తాజాగా ఓ కుటుంబం కూడా ఓ బాబా చేతిలో ఇరుక్కున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే..
హైదరాబాద్ టోలిచౌకుకు చెందిన ఓ యువతి గత కొంతకాలం నుంచి తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని తన కుటుంబ సభ్యులు నెల్లూరులో ఓ దర్గాకు చెందిన బాబా హఫీజ్ పాషా దగ్గరికి తీసుకెళ్లారు. అయితే ఆ బాబా ఆమెకు దయ్యం పట్టింది అని.. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అని.. ఆ అమాయక కుటుంబ సభ్యులకు చెప్పి నమ్మించాడు.
దీంతో ఆ యువతకి మూడేళ్ల నుంచి చికిత్స తీసుకున్న కూడా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఇక ఆ బాబా వెంటనే ఆ అమాయకపు కుటుంబ సభ్యులకు.. మరి కొన్ని రోజులు మీ అమ్మాయి చనిపోతుందని భయపెట్టించాడు. దీంతో ఆమెను పెళ్లి చేసుకుని ఆమె ప్రాణాలు కాపాడుకుంటాను అని వారిని నమ్మించాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కూడా ఆ బాబా మాటలు నమ్మి పెళ్లికి ఒప్పుకున్నారు.
అయితే ఈ నెల 11న హైదరాబాద్ టోలిచౌక్ లో ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లికి ఏర్పాట్లు చేశారు ఆ కుటుంబ సభ్యులు. ఇక పెళ్లి మండపానికి ఎంతకు ఆ బాబా రాకపోవటంతో.. అనుమానం వచ్చి ఆ కుటుంబ సభ్యులు బంధువులను సంప్రదించారు. దీంతో అతడు అనారోగ్యంతో ఉన్నాడని తెలియటంతో యువతకు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి గట్టిగా ఆరా తీశారు. ఇక అప్పటికే అతడు కొంతమందిని పెళ్లి చేసుకున్నాడని.. ఇప్పటికే అతనిపై 13 కేసులు ఉన్నాయని తెలిసింది. ఇక ఆ బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో.. ఆ దొంగ బాబాకు ఇప్పటికే ఏడు పెళ్లిళ్లు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
Related News
Fraud : ఆ మహిళలే అతడి టార్గెట్.. నమ్మించి నట్టేట ముంచి.. చివరికి..!
విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్. ఆ మహిళలు... ఒంటరిగా జీవించేవారు. సొంతంగా ఎవరూ లేని వారు. మానసికంగా చాలా బలహీనంగా ఉండి మరో జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న వారు.