HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Attempted Compensation With Forged Documents

Odisha Train Accident: దారుణం.. డబ్బు కోసం చేతివాటం చూపిస్తున్న ఒడిశా ప్రజలు?

తాజాగా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదకర ఘటన గురించి మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. కొన్ని ఫ్యామిలీలను మొత్తం బలి తీస

  • By Anshu Published Date - 03:48 PM, Wed - 7 June 23
  • daily-hunt
Rail Accidents
Odisha Train Accident

తాజాగా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదకర ఘటన గురించి మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. కొన్ని ఫ్యామిలీలను మొత్తం బలి తీసుకుంది. ఇంకొందరు కుటుంబంలో కుటుంబ పెద్దలను కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిచివేసింది. అయితే కొందరు మానవత్వం లేని మనుషులు ఈ ప్రమాదాన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఉపయోగించుకొని ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం నకిలీ సర్టిఫికెట్లను క్రియేట్ చేసుకుంటున్నారు.

ప్రమాదంలో మరణించిన వారికి రిజర్వేషన్ చేయించుకున్న వారికి టికెట్ తీసుకున్న వారికి చివరికి టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వారికి కూడా నష్టపరిహారం అందిస్తాము అని ఒడిశా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొందరు స్వార్థపరులు చేతివాటం చూపిస్తున్నారు. కొందరు దుర్మార్గులు ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని కోసం ఆశపడి చనిపోయింది తన వాళ్లే అంటూ నకిలీ డాక్యుమెంట్ల తో శవాలను తీసుకెళ్లి పోతున్నారు. తాజాగా ఆ మోసాన్ని ఒడిశా ప్రభుత్వం గుర్తించి అప్రమత్తమయ్యింది.

ఒడిశా కటక్ సమీపంలోని మనియబంధ గ్రామానికి చెందిన గీతాంజలి గుప్తా అనే 35 ఏళ్ల మహిళ తన భర్త విజయ్ దత్తా అనే 47 ఏళ్ల వ్యక్తి కనిపించడం లేదని మతం జరిగిన రోజు తన భర్త కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించాడని అప్పటినుంచి తన భర్త ఆచూకీ తెలియడం లేదు అని పోలీసులకు చెబుతూ దొంగ కన్నీరు కార్చింది. ప్రమాద బాధితులను తరలించిన ఆసుపత్రులకు కూడా వెళ్ళానని అయినా కూడా లాభం లేకుండా పోయిందని పోలీసుల ముందు దొంగ నాటకాలు ఆడింది. ఆ తర్వాత పోలీసులు ఆమెను ఒడిశా ప్రమాద మృతదేహాలు ఉంచిన ప్రాంతానికి తీసుకెళ్లగా అక్కడున్న ఫోటోలను చూసుకోవాలని సూచించారు.

కొన్ని ఫోటోలు చూసిన తర్వాత ఒక వ్యక్తి ఫోటో చూపిస్తూ అతనే తన భర్త అని ఆమె తెలిపింది. భర్త డెడ్ బాడీ అని చెప్పి తీసుకెళ్లడానికి గీతాంజలి ఆధార్ కార్డు చూపించగా అందులో గీతాంజలి వయసు 60 ఏళ్లుగా ఉంది కానీ ఆమెకు అంత వయస్సు ఉన్నట్టుగా కనిపించలేదు. దానికి తోడు ఆమె ప్రవర్తన పై పోలీసులకు అనుమానం రావడంతో ఆధార్ కార్డు ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్లో విచారించగా గీతాంజలి భర్త చనిపోలేదని బతికే ఉన్నాడని తెలిసింది. అంతే కాకుండా ఆ కోరమాండల్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించలేదని తెలిసింది. దాంతో సదరు మహిళను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మృతుల కుటుంబాలకు ఇచ్చే పది లక్షల పరిహారం కోసమే ఇలా నకిలీ పత్రాలను తీసుకువచ్చినట్లు ఆమె అంగీకరించింది. దాంతో వెంటనే అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం దానిని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అప్రమత్తమయింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • compensation
  • forged documents
  • odisha govt allert
  • Odisha train accident

Related News

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd