Uttar Pradesh: యూపీలో దారుణం.. ఇద్దరు చిన్నారులపై గొడ్డలితో దాడి
- By Balu J Published Date - 06:32 PM, Wed - 20 March 24
Uttar Pradesh: యూపీలోని బదౌన్ లో ఘోరం జరిగింది. ఓ సెలూన్ షాపు యజమాని సాజిద్ .. ఇద్దరు చిన్నారులను అతికిరాతకంగా గొడ్డలితో నరికిచంపాడు. అనంతరం ఆ బార్బర్ ను పోలీసులు కాల్చి చంపారు. సాజిద్ ఇటీవలే స్థానికంగా సెలూన్ షాపు ప్రారంభించినట్లు తెలిసింది. షాపు ఎదురుగా ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లిన సాజిద్ .. ఆయుష్ , అహాన్ , యువ్ రాజ్ అనే ముగ్గురు 12 ఏళ్ల లోపు పిల్లలపై దాడి చేశాడు. వారిని భవనం పైకి తీసుకెళ్లి ఇద్దరిని గొడ్డలితో నరికిచంపాడు. దాడిలో గాయపడ్డ యువ్ రాజ్ తృటిలో తప్పించుకున్నాడు. దాడి సమయంలో ఆ చిన్నారుల తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నట్లు తెలిసింది.
తన భార్య కడుపుతో ఉందని, చికిత్సకు 5వేల రూపాయలు కావాలని అడగ్గా.. ఆమె ఆ మొత్తాన్ని అప్పుగా సాజిద్ కు ఇచ్చింది. టీ తెస్తానని ఆమె లోపలికి వెళ్లగానే.. సాజిద్ ఈ హత్యలకు పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయిన నిందితుడు.. ఓ అటవీ ప్రాంతంలో నక్కాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సాజిద్ ను పట్టుకునేందుకు వెళ్లగా.. వారిపై దాడి చేశాడు. దీంతో పోలీసులు సాజిద్ ను కాల్చిచంపారు. వ్యక్తిగత కక్షలే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత బాధితుల బంధువులు.. సాజిద్ బార్బర్ షాపుపై దాడి చేసి ధ్వంసం చేశారు
Related News
AP News: విజయనగరం జిల్లాలో 6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత
AP News: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల అధికారులు, ప్రత్యేక పోలీసుల బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. పోలీసులకు డబ్బుతో పాటు బంగారు నగదు పట్టుబడుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో భారీగా బంగారం దొరికింది. విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం మోదవలస దగ్గర పోలీసుల తనిఖీలు నిర్వహించారు. రూ.6 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ భారీ మొత్తంలో బ�