Rains In AP : ఏపీలో రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం – ఐఎండీ
అల్పపీడనం కొనసాగుతుండటంతో ఏపీలో రానున్న 24 గంటలపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం నాటికి దక్షిణ ఒడిశాలో
- By Prasad Published Date - 09:47 AM, Thu - 14 July 22
అల్పపీడనం కొనసాగుతుండటంతో ఏపీలో రానున్న 24 గంటలపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం నాటికి దక్షిణ ఒడిశాలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో పరివేష్టిత ఉపరితల ద్రోణిలో నైరుతి దిశలో ఏర్పడినందున ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రుతుపవన ద్రోణి, షీర్ జోన్ దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురవగా, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తీరంలోని మత్స్యకారులు ఈ నెల 16 వరకు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అయితే శుక్రవారం నుంచి రెండు మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు తగ్గే అవకాశం ఉంది.
మరోవైపు గోదావరికి వరద పోటెత్తుతోంది. అధికారులు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ జిల్లా కలెక్టర్లకు సూచనలు చేస్తున్నారు. 6 NDRF, 4 SDRF బృందాలు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమలోని 51 లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వరద బాధితులు స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి బుధవారం కూడా భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం ఎగువ పరివాహక ప్రాంతంలోని జూరాల నుంచి జలాశయానికి 1,05,822 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, గరిష్ట నీటి నిల్వ 215.807 టీఎంసీలు. ప్రాజెక్టులో బుధవారం సాయంత్రం 6 గంటలకు 826.90 అడుగుల వద్ద 46.5146 టీఎంసీలు నమోదయ్యాయి.
Related News
Rain Alert : మే 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తమగు చిరు జల్లులు పలకరిస్తూ చల్లపరుస్తూ వస్తున్నాయి. ఇక నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడింది