AP Teachers Protest : మరోసారి రోడ్డెక్కనున్న ఏపీ టీచర్స్.. ఈ నెల 22న మహాధర్నా..?
ఏపీలో ఉపాధ్యాయులు మరోసారి రోడ్డెక్కనున్నారు....
- By Prasad Published Date - 09:36 AM, Mon - 19 September 22

ఏపీలో ఉపాధ్యాయులు మరోసారి రోడ్డెక్కనున్నారు. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈనెల 22న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఏటీఎప్ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి కె. బసవ లింగరాజు తెలిపారు. ప్రాథమిక పాఠశాలలో విలువైన పద్ధతి ఉపసంహరించుకొని జీవో నెంబర్ 117 వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోగా కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు