AP Inter Results : నేడు ఏపీ ఇంటర్ రిజల్ట్స్.. మధ్యాహ్నం విడుదల చేయనున్న మంత్రి బొత్స
- By Prasad Published Date - 08:47 AM, Wed - 22 June 22

ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 6వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్, మే7వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తి చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విడులయ్యే ఇంటర్ ఫలితాలను https://bie.ap.gov.in కానీ http://manabadi.co.in లో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వివరాలు చెక్ చేసుకోవచ్చు.