AP Capital: ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. రాజధానిపై తీర్పు ఇచ్చిన హైకోర్టు
అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
- By Hashtag U Published Date - 11:04 AM, Thu - 3 March 22
అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఈరోజు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సీఆర్డీఏ చట్టానికి అనుగుణంగా రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆరునెలల్లో రాజధానిలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది రాజధాని రైతులకు మూడు నెలల్లో ఫ్లాట్ ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధిని ఎప్పటికప్పుడు హైకోర్టుకు తెలపాలని ఆదేశించింది. రాజధాని భూములను ఇతర అవసరాలకు వాడుకోవద్దని హైకోర్టు తీర్పులో ప్రస్తావించింది. హైకోర్టు తీర్పుతో రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
Related News
BRS Leaders: రేవంత్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ : బీఆర్ఎస్ నేతలు
BRS Leaders: బీఆర్ఎస్ నేతలు దేవిప్రసాద్, చిరుమళ్ల రాకేష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గత పదిహేను రోజులుగా రైతాంగం తీవ్ర ఆందోళన లో ఉందని, రైతులకు భరోసా ఇచ్చే ప్రభుత్వం రాష్ట్రం లో లేదని వారు మండిపడ్డారు. రైతు భరోసా కింద పెంచిన మొత్తం రైతులకు ఇస్తామని చెప్పి రైతు బంధు సాయం తోనే ప్రభుత్వం సరిపెట్టింది అది కూడా మొత్తం ఇవ్వలేదని