Vizag Steel Plant: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన అంశంపై వేసిన పిటిషన్ నేడు హైకోర్టు విచారణ చేపట్టింది.
- By Hashtag U Published Date - 09:42 PM, Mon - 29 August 22
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన అంశంపై వేసిన పిటిషన్ నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లక్ష్మీనారాయణ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆర్టికల్ 21కు విరుద్ధమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్తూ ఆయన తరఫు న్యాయవాది బాలాజీ ఇవాళ హైకోర్టులో వాదనలు వినిపించారు. స్టీల్ ప్లాంట్ కోసం వేలమంది రైతుల నుంచి 22 వేల ఎకరాలు సేకరించారు. 9,200 మందికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు. కొన్ని కుటుంబాల్లో నాలుగో తరం వచ్చినా ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని న్యాయవాది బాలాజీ కోర్టుకు వివరించారు. అటు, ఏపీ సర్కారు తరఫున ఏజీ వాదనలు వినిపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని కోర్టుకు నివేదించారు.
ఇరువురి వాదనలు విన్న హైకోర్టు దర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్రం, RINL, రాష్ట్ర ప్రభుత్వం, స్టీల్ ప్లాంట్ లను ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 21కి వాయిదా వేసింది.
కేంద్ర ప్రబుత్వం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే పార్లమెంటులో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి గతంలోనే ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
Related News
CM Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్పై టీడీపీ, బీజేపీ వైఖరి చెప్పాలి: సీఎం జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్పై టీడీపీ, బీజేపీ వైఖరి ఏంటో ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్. మేమంతా సిద్దం బస్సు యాత్ర 21వ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్ ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై నివేదించారు.