HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ap Government Released Go On Hike Pension

CM Jagan : పేదల పెన్షన్‌ రూ.5 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం

  • Author : Kavya Krishna Date : 02-03-2024 - 10:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Jagan
Cm Jagan

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.

అమరావతి రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన, భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని పెంచుతూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. గతంలో రూ.2500 వేల చొప్పున పెన్షన్‌ అందిస్తుండగా.. ఆ మొత్తాన్ని రూ. 5 వేలకు పెంచుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇటీవల గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పింఛన్ మొత్తాన్ని పెంచుతామని, వచ్చే నెల నుంచి ఇది అమలు చేస్తామంటూ సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలోనే సీఎం వైఎస్‌ జగన్ ఇచ్చిన మాట మేరకు ఏపీ ప్రభుత్వం వారికి పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

అయితే.. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పింఛన్ల పెంపు విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్ దృష్టికి తీసుకురావడంతో సానుకూలంగా స్పందించిన సీఎం.. వీరికి అందించే పింఛన్ మొత్తాన్ని రూ.2,500 నుంచి రూ. 5వేలకు పెంచాలంటూ అధికారులకు ఆదేశించారు.

గతంలో సాధారణ పెన్షన్లు రూ. వెయ్యి ఉన్న సమయంలో అమరావతి ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన వారికి రూ.2.500 పెన్షన్లు ఇచ్చేవారని జగన్ గుర్తు చేశారు. వైసీపీ హయాంలో వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.3 వేలకు పెంచామని తెలిపిన వైఎస్ జగన్.. రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన వారికి కూడా పింఛన్ మొత్తాన్ని పెంచుతామని సభావేదికగా ప్రకటించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP government
  • breaking news
  • cm jagan
  • Latest News
  • telugu news

Related News

Dhulipalla Narendra Kumar

టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ

Dhulipalla Narendra  పొన్నూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవికి చింతలపూడిలో ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆమె గుంటూరులోని ధూళిపాళ్ల నరేంద్ర వద్ద ఉంటున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున చింతలపూడిలోని ఆమె నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన దొంగలు 43 సవర్ల బంగారంతో పాటుగా, పది కేజీల వెండి, లక్ష

  • New Jersey

    చిన్నారులపై లైంగిక దాడి..అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్!

  • Madanapalle

    మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య..

  • Andhra Pradesh Nursing Admissions 2026–27

    నర్సింగ్ అడ్మిషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

Latest News

  • Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

  • Condoms : కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీకు ఈ సమస్య వచ్చినట్లే ? నిజమా ?

  • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

  • PEPAIR : శ్వాసకోశ రోగులకు ‘పిపెయిర్’ వరం

  • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd