YS Jagan : జగన్ కడప టూర్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు వైఎస్సార్ కడప జిల్లాకు వెళుతున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మనవడి వివాహానికి హాజరవుతారు. అనంతరం పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.
- By Hashtag U Published Date - 05:00 PM, Thu - 16 June 22
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు వైఎస్సార్ కడప జిల్లాకు వెళుతున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మనవడి వివాహానికి హాజరవుతారు. అనంతరం పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.
జగన్ పర్యటన షెడ్యూల్ వివరాలు:
శుక్రవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి 9.50 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
అక్కడి నుంచి విమానంలో బయల్దేరి 10.40 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
10.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయల్దేరి 11 గంటలకు ప్రొద్దుటూరుకు వెళతారు
11.25 గంటల నుంచి 11.40 వరకు తిరుపాల్ రెడ్డి మనవడి వివాహ వేడుకలో పాల్గొంటారు.
అనంతరం అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.10 గంటలకు పులివెందుల హెలిప్యాడ్ కు చేరుకుంటారు.
12.20 గంటలకు పులివెందుల గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు.
12.30 నుంచి 4.00 గంటల వరకు నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమవుతారు.
సాయంత్రం 4.40 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి గన్నవరం చేరుకుంటారు.
సాయంత్రం 5.45 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి తిరిగి చేరుకుంటారు.
Related News
AP Politics : ప్రచారంలో వైసీపీ ముందంజ..?
వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేపట్టిన 'మేమంత సిద్ధం' (Memantha Siddam) బస్సుయాత్ర నిన్న దీబగుంట్లకు చేరుకున్నది. బస్సుయాత్రలో మహిళలు, యువకులు చురుగ్గా పాల్గొన్నారు. ప్రతి స్టాప్లోనూ ఆయనకు ఘనస్వాగతం లభించింది. అదేవిధంగా బుధవారం బస్సు ప్రొద్దుటూరు వైపు వెళ్లగా వైఎస్ జగన్కు స్వాగతం పలికేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు.